More

    మార్కాపురం శివారులో ఘోర ప్రమాదం: టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. 14 మంది సజీవ దహనం

    Date:

    : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులో గురువారం అర్ధరాత్రి దాటాక ఊహించని విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదు నెలల పసికందు సహా మొత్తం 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హరి కృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుండి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తుండగా మార్కాపురం – రాయవరం మధ్య ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా బస్సు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులోని డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు క్షణాల్లో బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటల్లో చిక్కుకుపోయారు. కొందరు కిటికీలు పగలగొట్టి ప్రాణాలు దక్కించుకోగా, మిగిలిన వారు లోపలే చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యారు.

    ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతదేహాలను గుర్తించడం కష్టతరం కావడంతో, ప్రభుత్వం డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షల అనంతరం బాధితుల వివరాలను నిర్ధారించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు, మార్కాపురం ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    ప్రమాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

    శ్రీరామనవమి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. కేవలం రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వారు ఇలా అగ్నికి ఆహుతి కావడం చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఇంతటి భారీ ప్రాణనష్టానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. ఆర్టికల్ 142 పవర్ ఇదే!

    న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని ఒప్పందం చేసుకుని, ఆ తర్వాత...

    బ్రేకింగ్ న్యూస్: భారీగా పతనమైన బంగారం ధరలు! రూ. 1.50 లక్షల మార్కుకు దిగువకు పసిడి.. వెండి కూడా విలవిల!

    హైదరాబాద్/న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. గత కొన్ని...

    చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ జంప్.. బయటపడ్డ రహస్యాలు!

    బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా...

    పెట్రోల్‌లో మరికొంత ఇథనాల్.. ధరలు తగ్గే అవకాశం ఉందా?

    న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలను అదుపులో ఉంచడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని...